Tulasi Kalyanam on Utthana Dwadashi
కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ ఉత్థాన ద్వాదశినాడు తులసి మొక్కకి కల్యాణం చేస్తారు. ఈ పుణ్యదినానికి
సంబంధించిన అంశాలను ఒకసారు గుర్తుచేసుకుందాం.
.png)
ఉత్థాన ద్వాదశినాడు తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పూరాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద, ఉసిరి మొక్కలను నాటుతారు. పురాణ కథనాన్ని అనుసరించి, తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది.
దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్ళి చేసుకోవాలని కలలు కంది. అయితే, అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన సహజంగానే ఆమెకి తులసిమీద మహా కోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి, తులసిని ''నువ్వు మొక్కగా మారిపో'' అని శపించింది.

ఆ విధంగా తులసిమొక్క కు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసిమొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసిమొక్క మనకు ఆరాధ్యం.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా |
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం ||
అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసికోటకు పసుపు కుంకుమలు పెట్టి, తులసివనాన్ని భక్తిగా పూజిస్తాం.
కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసిమొక్కకు కల్యాణం జరిపించి తీర్ధ ప్రసాదాలు తీసుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.
No comments:
Post a Comment