Saturday, October 29, 2011

నీటి అడుగున గుడిని ఎవరు కట్టారో..!


నీటి అడుగున గుడిని ఎవరు కట్టారో..!
(Temple under water)

కొన్నాళ్ళ క్రితం ఇండోనేషియా కాపిటల్ సిటీ అయిన జకర్తాలోని పెముటేరన్, బాలి సముద్ర తీరప్రాంతంలో నీటి అడుగున తమన్ పురా (Temple Garden) హిందూ దేవాలయం బయటపడింది. ఏదో చిన్న విగ్రహమో, శిల్పమో తవ్వకాలలో బయటపడితేనే వింతగా చెప్పుకుంటాం. అలాంటిది ఏకంగా ఒక ఆలయం కనిపించడమంటే మహా వింతేగా మరి.

ఆ నిర్మాణం దేవాలయం ఆకృతిలో ఉండటమే కాకుండా అందులో పది పెద్ద రాతి విగ్రహాలు దర్శనమిచ్చాయి. పైగా అవి శిలా ఫలకాల మీద అమర్చి ఉన్నాయి. అది ఆషామాషీ దేవాలయం కాదు. భారీగా కట్టినదే. గుడి ముఖద్వారం నాలుగు మీటర్ల ఎత్తున ఉండటమే కాకుండా 29 మీటర్ల లోతులో ఉంది. ఇక చేప్పేదేముంది... కుప్పలుతెప్పలుగా తరలివచ్చిన జన సందోహమే కాకుండా, మీడియా ఆఘమేఘాలమీద పరుగులు తీసింది. దానికి సంబంధించి పత్రికలూ, చానళ్ళు కూడా తెగ కధలు రాశాయి. అందరి నోట్లో ఆ వార్తే. అవకాశం ఉన్నవాళ్ళు స్వయంగా వెళ్ళి చూశారు.

ఇండోనేసియా ప్రభుత్వ యంత్రాంగం దాన్ని మిస్టరీగా పరిగణించలేదు. జకార్తా సాంస్కృతిక, పర్యాటక శాఖ శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలని ప్రజలకు హితవు చెప్పింది. ఆ దేవాలయం వెనుక ఉన్న మర్మం ఏమిటో, ఆ నిర్మాణం ఎప్పుడు కట్టారో కూపీ లాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టారు. పురావస్తు పరిశోధన శాఖ వారిని రంగంలోకి దింపారు. ఆర్కియలాజికల్ డిస్కవరీ విభాగంవారు, అండర్ సీ విభాగం వారు అసలు సంగతి కనిపెడతామని మాట ఇచ్చారు. ఆచరణాత్మకంగా చేసి చూపించారు.

బెంటార్ అనే వ్యక్తికి సముద్రంలో ఈత కొట్టడమంటే మహా ఇష్టం. అతనలా ఈత కొడుతుండగా ఈ దేవాలయం దర్సనమిచ్చింది. దాంతో బెంటారు దాన్ని పునర్నిర్మించాలి అనుకున్నాడు. 2000 సంవత్సరంలో కరంగ్ లేస్తారి ప్రాజెక్టు కింద అమెరికా ఇచ్చిన ఆర్ధికసాయంతో దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది. అప్పట్లో ఈ విషయం అందరి దృష్టికీ ఎందుకు రాలేదో తెలీదు. 2005లో బెంటార్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోవడంతో లేస్తారి ప్రాజెక్టు ఆగిపోయింది.

నీటి అడుగున ఉన్నప్పటికీ ఈ గుడి మహా సౌందర్యాత్మకంగా ఉండటం విశేషం. ఈ దేవాలయం గురించిన మరిన్ని అంశాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా నీళ్ళల్లో దేవాలయం నిర్మించడం అంటే మాటలు కాదు కదా. మనవాళ్ళ ఆశా దృక్పథాన్ని, కళా నైపుణ్యాన్ని, అడ్వెంచర్స్ చేయాలనే నైజాన్ని ప్రశంసిద్దాం.

మనచుట్టూ ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలూ విడ్డూరాలూ జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాటి మర్మం ఏమిటో అర్ధం కాదు. మరికొన్నిసార్లు ఆ సంఘటన వెనుక కారణం ఏదో ఉంటుంది. అది తెలీక మనకు చిత్రంగా, గమ్మత్తుగా ఉంటుంది. దానికి తోడు పుకార్లు షికార్లు చేసి, పూవు పూసింది అంటే కాయ కాసింది అంటారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. చిత్రమైన విషయానికి చిలువలూ పలువలూ తోడయ్యేసరికి మరింత మిస్టరీగా మారుతుంది. మిరాకిల్ గా చెప్పుకుంటాం. అలాంటి అంశాల్లో ఇదొకటి.

mysteries in indian temples Jakarta, miracle of underwater temple, Temple Garden in Jakarta, mysteries and miracles of Temples

తెలుగువారి పండుగ నాగులచవితి




నాగుల చవితి, దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి, నాగ షష్టి కూడా నాగుల చవితి లాంటి విశేష దినాలే.

నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.

నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్నిప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.

ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.

Tuesday, October 25, 2011

దీప్తులు చిందించే దీపావళి




శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి, సేతమ్మను తీసుకుని, అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం నెలకొందని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది. 

Happy Diwali
Deepavali scraps & graphics


హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.

మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.

అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. దీపావళి రోజున కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు.

దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటో చూద్దాం. పూర్వం దూర్వాసముని దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. కానీ, దేవేంద్రునికి దాని గొప్పతనం తెలీక, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు కాస్తా హారాన్ని కాళ్ళతో తోక్కేసేంది. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనమైన స్థితిలో పడ్డాడు. శ్రీహరిని ప్రార్ధించగా ''ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, భక్తిగా పూజించమని'' పరిహారం చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. దాంతో లక్ష్మీదేవి కరుణ చూపి, ఇంద్రునికి తిరిగి దేవలోక ఆధిపత్యాన్ని, సర్వ సంపదలను అనుగ్రహించింది.

తనను అనుగ్రహించిన లక్ష్మీదేవిని ఉద్దేశించి, దేవేంద్రుడు ''తల్లీ, సామాన్యులు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా?” అనడిగాడు. 


Deepavali scraps & graphics


అప్పుడు లక్ష్మీదేవి ''నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్ధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను'' అని బదులిచ్చింది. అప్పటినుంచీ దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.

దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులసికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. రెండు దీపాలకు తక్కువ లేకుండా కొందరు అనేక దీపాలతో స్వర్గాన్ని తలపించేలా అలంకరిస్తారు.

ఇక సాయంత్రం అయ్యేసరికి బాణాసంచా కాల్చడం మొదలౌతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, రకరకాల టపాకాయలు కాలుస్తూ సంబరం చేసుకుంటారు.


Diwali cards



దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.


Monday, October 24, 2011

Legends Of Diwali, Diwali Legends, Diwali History,



There are many legends associated with the origin of the festival of lights. The fesitval is dedicated to various gods and goddesse. The basic ideology behid the celebration is the abundance of autumn harvest. The other legends associated with the deepavali festival is given below: 
The Legends of Diwali 

Saturday, October 22, 2011

THE MIND,ONE OF ITS OWN….


THE MIND IS AN ESSENTIAL PART OF OUR PERSONALITY.
IT IS AN EXPRESSION OF OUR CONSCIOUSNESS.
THE STOMACH IS HUNGRY BUT THE HUNGER IS FELT THROUGH THE MIND,AND THE MOTIVATION FOR APPEASING HUNGER BY EATING FOOD ALSO COMES FROM THE MIND.
AS YOU GO ON EATING AT ONE STAGE YOU FEEL SATISFIED AND YOU?STOP EATING.
THIS ACTION IS ALSO PROMPTED BY MIND.
THE MIND IS INDEPENDENT OF THE BODY,THOUGH CONNECTED TO IT.
IT SEEMS TO BE ENCASED IN THE BODY BUT IT HAS DEEPER SIGNIFICANCE AND INFLUENCE.
IT IS THE CREATOR OF YOUR CONTENTMENT OR DISCONTENTMENT.
IT IS THE SOURCE OF YOUR FULLFILMENT.
IT IS THE ORIGIN AS WELL AS THE TERMINUS OF YOUR INTERACTIONS.
WHEN SUCH IS ITS INFLUENCE AND POTENTIAL, SHOULD YOU NOT FIND OUT HOW THE MIND CAN BE ACCESSED AND IF NECESSARY MOLDED IN THE MOST SUITABLE MANNER?

IMPORTANT IT IS TO KNOW “THE MIND”


oUR MIND WORKS IN TWO MODES. CONSCIOUS AND SUBCONSCIOUS MODE. OUR SUB CONSCIOUS MIND IS MUCH MORE POWER FULL THAN THE CONSCIOUS MIND. IT INFLUENCES THE CONSCIOUS MIND, HOW WE THINK AND OUR BELIEF. IF THE SUBCONSCIOUS MIND IS POSITIVE, IT WILL INFLUENCE THE CONSCIOUS MIND TO BE POSITIVE AND VICE VERSA. LIKE AN ICEBERG,OUR CONSCIOUS MIND IS TIP OF THE ICEBERG OF WHICH OUR SUBCONSCIOUS MIND IS THE HUGE BASE UNDERNEATH OF WATER. IT IS MANY TIMES LARGER AND STRONGER THEN THE CONSCIOUS MIND.

Wednesday, October 12, 2011

Time and Love…….




Once upon a time there was an island where all the feelings lived;
happiness, sadness, knowledge, and all the others, including love.

The 6 Keys to Success



Bloom where you are planted. You have a choice to get back up after temporary set backs. Attitude is a small thing that makes a big
difference!
If you don”t know where you are going, any road will get you there. Write your short term goals down on paper. I have discovered and continue to discover that putting your dreams and goals down on paper lock in or focus your belief that they can be achieved–even if you have to take a course correction in achieving your goals. Success comes in cans, failure comes in can”ts.
Explore what is important to you. Maybe it is family, friends, your
spirituality or working hard at any given task. I can assure you that your priorities will change as you grow older. Very important that you value yourself and treat yourself like the valuable gift from God that you are.


Birds of a feather flock together. This is to say that if you are hanging
around winners or others with a “can do” mind-set, you”ll likely adapt to this same kind of thinking. Remember–”SUCCESS LEAVES CLUES!
Feelings may change, commitments do not. “Success is getting up one more time than you fall.” I have often wanted to give up, and then I must think to myself about what the consequences of giving up will be. Generally, this is more than enough of a motivation to make us stick to the task at hand even if we don”t feel like it. When the task is achieved, Whow!–IT FEELS GREAT!

Be an encourager and comforter to friends that are feeling discouraged. I promise that you will not regret this as you will be encouraged by one, if not many, when you are feeling down. Encouragement and love are contagious qualities that can change the minds of the most stubborn and “hard-to-get- along-with” people you know. I have seen it happen over and over again.

THOUGHTS TO REMEMBER ~




































Foot Massage



Foot massage
The feet are the most abused and yet the most neglected parts of our bodies. Our feet support our weight when we are standing, which can be too much if one is overweight or has been standing still for a long time. Whenever we walk or run, the first to feel the shock of the contact between the ground and our bodie  are our feet. We keep our feet confined in shoes and socks or stockings for most of the day. The ladies are prone to stressing out their feet more because of the ridiculous necessity of wearing high heels. No wonder our feet hurt so much at the end of the day!
This is why a good foot massage at the end of the day can be an exhilarating experience. Practitioners of reflexology and alternative medicine claim that the nerve endings on the foot correspond to a specific organ of the body, and so massaging certain areas of the foot is like massaging that particular organ to which it is linked. Whatever claims these practitioners of reflexology may have, the simple fact is that foot massage is so terrific that many who get them on a regular basis are ready to state that it is almost as good as getting a full body massage.

Thursday, October 6, 2011

శ్రీ రాజరాజేశ్వరీదేవి - తొమ్మిదవ రోజు


శ్రీ రాజరాజేశ్వరీదేవి - తొమ్మిదవ రోజు
(Sri Rajarajeswari Devi - 9)

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.

నైవేద్యం - లడ్డూలు
కావలసిన పదార్ధాలు
శనగపిండి - 1 కప్పు
నూనె - పావుకిలో
జీడిపప్పు : 50 గ్రాములు
పంచదార - 1 కప్పు
నీళ్ళు - 1 కప్పు  
తయారు చేసే పద్ధతి
శనగపిండిలో తగినన్ని నీళ్ళు కలిపి ముద్దచేసి, బూందీ తయారు చేసుకోవాలి. ఆ బూందీని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక గిన్నెలో నీళ్ళు, పంచదార కలిపి పాకం పట్టుకోవాలి. ఈ పాకంలో బూందీ పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ముద్దను బాగా కలిపి పాలతో కొంచెం తడిచేసుకుంటూ ఉండలు చేస్తే సరి..రాజరాజేశ్వరీ దేవికి నివేదించాల్సిన లడ్డూలు సిద్ధం.

శ్రీ మహిషాసురమర్దినీ దేవి - ఎనిమిదవ రోజు


శ్రీ మహిషాసురమర్దినీ దేవి - ఎనిమిదవ రోజు
(Mahishasuramardini - 8)

మహిషమస్తక నృత్త వినోదిని 
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా 
జననరక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదిని

దేవి తొమ్మిది అవవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే "మహర్నవమి"గా ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చేయాలి. "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మో హిన్యైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదన చేయాలి.

నైవేద్యం - కేసరి పూర్ణాలు
కావలసిన పదార్ధాలు
మినప్పప్పు - 1 కప్పు.
బియ్యం - 2 కప్పులు.
రవ్వ - ‌1 కప్పు. ‌
పంచదార - 1 కప్పు.
ఇలాచీ పొడి - 1 స్పూనుడు
నెయ్యి - 2 స్పూన్లు.
నూనె - తగినంత
తయారు చేసే పద్ధతి
బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి. మూడు గంటల తర్వాత రెండింటినీ కలిపి, చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. పిండిలాగా మెత్తగా రుబ్బాలి. గారెల పిండికంటే కొంచెం జారుగా ఉండేటట్లు చూడాలి. రుబ్బిన పిండి ఒక రాత్రంతా నానాలి.
బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో రవ్వ ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోయాలి. నీరు మరుగుతున్నప్పుడు పంచదార, ఇలాచీ పొడి వేసి కలపాలి. నీళ్ళు రెండు పొంగులు రానిచ్చి బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి. సన్నని సెగపై ఉంచి ఉడికించాలి. ఉడికిన తర్వాత దింపి చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలు చేసి పళ్ళెంలో వేయాలి.
మూకుట్లో నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉండని సిద్ధంగా ఉన్న పిండిలో ముంచి వేయాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీయాలి.