Sunday, May 15, 2011

మన మేనేజ్‌మెంట్‌ గురువులకు ప్రేరణ




ఆధునిక
 వ్యాపార సూత్రధారి కృష్ణుడే


కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన..
భగవద్గీతలోని ఈ ప్రవచనాన్ని ఇప్పుడు మేనేజ్మెంట్‌గురువులువల్లెవేస్తున్నారు. పాశ్చాత్య పోకడలకు పట్టం కట్టిన వీళ్లే ఈ మధ్య-క్షీరసాగరమథనంసుదర్శన క్రియగీతాసారం వంటివాటిని తమఉపన్యాసాల్లోజొప్పిస్తున్నారు. వాటిని ఆలంబనగా తీసుకోవాలని, ఆచరణలోపెట్టివిజేతలుగా నిలవాలని తమ శిక్షణ తరగతుల్లో సూచిస్తున్నారు.

పాశ్చాత్యులపై పైచేయి
దీపక్‌ చోప్రాసి.కె.ప్రహ్లాద్‌, అరిందమ్‌ చౌధురిశివ్‌ ఖేరా,మృత్యుంజయ్బి.ఆత్రేయహరీశ్‌ బిజూర్‌ తదితరులు ఇప్పటి కాలపు వ్యాపారనిర్వహణలోఎదురయ్యే సవాళ్లను తట్టుకొని ముందంజ వేసేందుకు తరచురామాయణమహాభారతాది హిందూ పురాణేతిహాసాలను తిరగేసితరణోపాయాలను సూచిస్తున్నారు. దీంతో ఫిలిప్‌ కోట్లర్‌, గేరీహామెల్‌, జాక్వెల్ష్‌, ఎడ్వర్డ్‌ డి బానో వంటి పాశ్చాత్యులది వెనకసీటే అవుతోంది.
యోగ ప్రాముఖ్యాన్ని గురించి మురారిసమగ్రంగా వివరించాడని, దీన్ని తమశిక్షణ సమావేశాల్లో ఆధారంగా చేసుకున్నామని బిజూర్ చెప్తున్నారు. చేసేపనిలోప్రావీణ్యం సాధించడం ప్రావీణ్యాన్ని ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా మళ్లీ మళ్లీ చాటుకోవడం ద్వారా వృత్తి జీవనంలోఉన్నతశిఖరాలను అధిరోహించవచ్చన్నదే యోగ అంతరార్థమనిఉద్ఘాటిస్తున్నారు. పలు వ్యాపార వ్యూహాలకుమూలాలను హిందూ పుక్కిటిగాథల్లో చూడొచ్చంటున్నారు. ఉదాహరణకు, ఏదైనా ఒక కంపెనీ స్వయంనైతికనియమావళికి కట్టుబడి అన్ని రకాల విధుల్లోనూ నాణ్యతనుకరతలామలకం చేసుకోవచ్చని బిజూర్‌ పేర్కొంటున్నారు.
ఇక ఆత్రేయ తన వంతుగా.. పాల కడలిని చిలికినప్పుడు అమృతం,హాలాహలం వెలువడ్డ ఘట్టాలను ఉటంకిస్తారు. దేవతలు (మంచికి ప్రతీకలు)దానవుల (చెడుకు నిదర్శనాలు)పై విజయం సాధించడానికి వీలుగా అమృతపానంచేసేందుకు ముందుగా విడుదల అయిన విషాన్ని శివుడు సేవించిగరళకంఠుడు అవుతాడు. నీలకంధరుడి విన్యాసంసాహసానికిచొరవకు,క్రమశిక్షణకుసరళత్వానికినిరాడంబరతకు చిహ్నం సద్లక్షణాలుఅన్నీ విజయాన్నికోరుకొనే బిజినెస్‌ లీడర్లుమేనేజర్లుఅలవర్చుకోవలసినవేనని ఆయన ఏకరవు పెడుతున్నారు.

సంక్షోభ వేళ...
దేశ, విదేశాల్లో ఆర్థిక సంక్షోభం విస్తరిస్తున్న వేళ కంపెనీలు ఉద్యోగులకుఉద్వాసన పత్రాలు ఇవ్వడమో, సిబ్బందికిసౌకర్యాలను తగ్గించడమో చేస్తున్ననేపథ్యంలో ఇలాంటి పుక్కిటి పురాణాల ఘట్టాల స్వారస్యాన్నిఆకళింపుచేసుకోవడం మరింత సందర్భోచితంగా ఉండగలదంటున్నారు.కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌)పై దృష్టినికేంద్రీకరించడం అన్నికంపెనీల ధర్మం కావాలిసంక్షోభ సమయాల్లో ఉద్యోగుల ప్రయోజనాలను అవికాపాడాలి. కాలంఅనుకూలించినప్పుడు కంపెనీ లాభాలు ఆర్జించవచ్చు;కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలి అని ఆత్రేయ విశ్లేషిస్తున్నారు.ఉత్పత్తులకు ధరలను తగ్గించుకొనిస్వల్ప లాభ శాతంతో సంతృప్తిచెందుతూ వ్యర్థాలను నివారించుకోవాలి అని ఆయనబోధిస్తున్నారు.మహాభారత గాథలో యుధిష్ఠరుడిని గురించి ప్రస్తావించి, 'నిత్యం అనేకజీవరాశులు యమ లోకానికిప్రయాణం కట్టడం ప్రజలు ఎరిగినదే. అయినప్పటికీప్రాణాలతో ఉన్న వారు మాత్రం తాము కలకాలం బతికి బట్టకట్టాలనుకుంటారు'అన్నారు. దీన్నే మరోవిధంగా చూస్తే, ప్రతి రోజూ అనేక మంది పదవీ విరమణచేస్తుంటారుఇదితప్పనిసరిగా సంభవించే పరిణామం అని ఆయన గుర్తుచేశారుఅయితే తాజా ఆర్థిక సంక్షోభంఅది వెంటతీసుకువచ్చేఅభద్రతప్రభావాన్ని కార్పొరేట్‌ యాజమాన్యాలు 'దీర్ఘదర్శులు'గా మారితే ఒకింతముందుగానే పసిగట్టి అరికట్టేఅవకాశాలు దక్కుతాయి.

ఆదర్శవంతమైన కార్పొరేట్‌ పరిపాలన సూత్రాలనురూపొందించుకోవడానికి వేదాలుఉపనిషత్తులు పరిశీలించడంవల్లతోడ్పాటు లభిస్తుంది. సంస్థల నిర్వహణ తీరు 'సాత్వికం'గా ఉంటే మేలు. ఇక్కడ సాత్వికం అంటే సమతౌల్యం, క్రమశిక్షణయుతంగా ఉండడం అని.సంస్థలు తమ వినియోగదారులు, వ్యాపార భాగస్వాముల పట్ల, ఉద్యోగుల పట్లశ్రద్ధతీసుకోవాలి. పటిష్ఠమైన కార్పొరేట్‌ పరిపాలనకు ఇది వెన్నెముకలాఆధారభూతమని ఆత్రేయ వేదాల నుంచిసోదాహరణంగా చెప్పుకొస్తారు.‌ ‌ ‌ 

No comments:

Post a Comment